జూన్ 1వ తేదీ నుంచి కొత్త రాజధాని నుంచే పాలన ..
- December 01, 2015
వచ్చే ఏడాది (2016) జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యకలాపాలు, విధులు నూతన రాజధాని నుంచే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం కార్యదర్శులు, శాఖాధిపతులు అందరూ కొత్త రాజధాని ప్రాంతం నుంచే తమ విధులను నిర్వహిస్తారని ఆయన తెలిపారు. తమ తమ శాఖలలోని అధికారులకు, ఉద్యోగులకు ఈ మేరకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. రాజధానిలో పని చేసేందేకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేసుకోవాలంటూ ప్రభుత్వ శాఖ విభాగాల అధిపతులు అందరికీ ఐవైఆర్ కృష్ణారావు సర్క్యులర్ మెమో జారీ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికి విజయవాడకు తరలిరావాల్సిందేనని ఏపీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్ రెండో తేదీ నాటికి రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటికల్లా పూర్తిస్థాయిలో సెక్రటేరియట్ను కూడా తరలించాల్సిందేనని కేబినెట్ నిర్ణయించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









