సీనియర్ నటి జయంతి కి సీరియస్..ఐసీయూ లో చికిత్స
- March 27, 2018
తెలుగు ఇండస్ట్రీలో సెంటిమెంట్ ప్రాధాన్యత గల చిత్రాల్లో నటించి అందరి మన్ననలు అందుకున్నారు నటి జయంతి. తల్లి పాత్రలో ఆమె జీవం పోసేవారు. తాజాగా సినీనటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో తొలుత బెంగళూరు సిటీ ఆసుపత్రికి బంధువులు తరలించారు. చిన్నచిన్నవేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహ పరిచినా పట్టుదలతో కష్టపడి పైకొచ్చింది.
ఆమె మాతృభాష తెలుగైనా కన్నడంలో ఎక్కువ చిత్రాల్లో నటించారు. కన్నడ మెగాస్టార్ రాజ్ కుమార్ తో దాదాపు 30 చిత్రాల్లో నటించారు. ఎన్.టి.రామారావుతో నటించిన జగదేకవీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండవీటి సింహం లాంటి హిట్ సినిమాల్లో నటించారు. దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు.
కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తాజాగా నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్న వైద్యులు, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నట్టు తెలుస్తోంది.
ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె శరీరంలోని మరిన్ని అవయవాలు పని చేయడం లేదని తెలుస్తోంది. నటి జయంతి తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించిన జయంతి, 1949,జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









