సీనియర్ నటి జయంతి కి సీరియస్..ఐసీయూ లో చికిత్స
- March 27, 2018
తెలుగు ఇండస్ట్రీలో సెంటిమెంట్ ప్రాధాన్యత గల చిత్రాల్లో నటించి అందరి మన్ననలు అందుకున్నారు నటి జయంతి. తల్లి పాత్రలో ఆమె జీవం పోసేవారు. తాజాగా సినీనటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో తొలుత బెంగళూరు సిటీ ఆసుపత్రికి బంధువులు తరలించారు. చిన్నచిన్నవేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహ పరిచినా పట్టుదలతో కష్టపడి పైకొచ్చింది.
ఆమె మాతృభాష తెలుగైనా కన్నడంలో ఎక్కువ చిత్రాల్లో నటించారు. కన్నడ మెగాస్టార్ రాజ్ కుమార్ తో దాదాపు 30 చిత్రాల్లో నటించారు. ఎన్.టి.రామారావుతో నటించిన జగదేకవీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండవీటి సింహం లాంటి హిట్ సినిమాల్లో నటించారు. దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు.
కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తాజాగా నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్న వైద్యులు, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నట్టు తెలుస్తోంది.
ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె శరీరంలోని మరిన్ని అవయవాలు పని చేయడం లేదని తెలుస్తోంది. నటి జయంతి తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించిన జయంతి, 1949,జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









