భారత్‌లో జర్నలిస్టుల హత్యలపై స్పందించిన ఐరాస

- March 28, 2018 , by Maagulf
భారత్‌లో జర్నలిస్టుల హత్యలపై స్పందించిన ఐరాస

మధ్యప్రదేశ్‌, బిహార్‌లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పాత్రికేయులు సోమవారం హత్యకు గురికావడం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో ఇసుకమాఫియా కేసును బయటపెట్టిన టీవీ జర్నలిస్ట్‌ సందీప్‌ శర్మను లారీతో ఢీకొట్టించి చంపించారు. బిహార్‌లో ఓ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్‌ నవీన్‌ నిశ్చల్‌ ను సర్పంచు చంపించేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఈ జర్నలిస్టుల హత్యలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. జర్నలిస్టులపై వేధింపులకు, హింసకు పాల్పడటం ఆందోళనకరమని, భారత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధకరమని ఐరాస అధ్యక్షుడు అంటోనియో గట్టర్స్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com