న్యూస్ రీడర్ రాధిక ఆత్మహత్య..సూసైడ్ నోట్లో..
- April 01, 2018
హైదరాబాద్ లో ఓ న్యూస్ ఛానల్ యాంకర్ సూసైడ్ చేసుకుంది. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానూ అంటూ సూసైడ్ లెటర్లో పేర్కొంది. అపార్ట్ మెంట్ భవనం పై నుంచి దూకి తనువు చాలించింది.
ఓ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న రాధిక.. హైదరాబాద్లోని మూసాపేటలో నివాసముంటోంది. ఆర్నెల్ల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటోంది. భర్త దూరమవ్వడంతో కొన్నాళ్లుగా తీవ్రమానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన ఆమె.. నిమిషాల వ్యవధిలోనే అపార్ట్మెంట్ ఆరో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సూసైడ్ లెటర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









