న్యూస్ రీడర్ రాధిక ఆత్మహత్య..సూసైడ్ నోట్లో..
- April 01, 2018
హైదరాబాద్ లో ఓ న్యూస్ ఛానల్ యాంకర్ సూసైడ్ చేసుకుంది. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానూ అంటూ సూసైడ్ లెటర్లో పేర్కొంది. అపార్ట్ మెంట్ భవనం పై నుంచి దూకి తనువు చాలించింది.
ఓ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న రాధిక.. హైదరాబాద్లోని మూసాపేటలో నివాసముంటోంది. ఆర్నెల్ల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటోంది. భర్త దూరమవ్వడంతో కొన్నాళ్లుగా తీవ్రమానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన ఆమె.. నిమిషాల వ్యవధిలోనే అపార్ట్మెంట్ ఆరో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సూసైడ్ లెటర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!







