ఉగ్రవాద జాబితాలో హఫీజ్ సయీద్ పార్టీ
- April 03, 2018
ఇస్లామాబాద్ : ముంబయి పేలుళ్ల కీలక సూత్రధారి అయిన హఫీజ్ సయీద్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న నేపథ్యంలో హఫీజ్ సయీద్ నేతృత్వంలోని మిల్లీ ముస్లింలీగ్(ఎమ్ఎమ్ఎల్) రాజకీయ ఫ్రంట్ను అమెరికా ప్రకటిత విదేశీ ఉగ్రవాద సంస్థగా పేర్కొంది.
ఎమ్ఎమ్ఎల్కు చెందిన కేంద్ర నాయకత్వ మండలిలోని ఏడుగురు నేతలను కూడా విదేశీ ఉగ్రవాదులుగా ప్రకటించింది. దీంతోపాటు తెహ్రిక్-ఈ-ఆజాది-ఈ-కశ్మీర్(టీఏజేకే)ను కూడా ఉగ్రవాద సంస్థల జాబితాలో ట్రంప్ యంత్రాంగం చేర్చింది.
అంతర్గత మంత్రిత్వ శాఖ అందించే క్లియరెన్స్ సర్టిఫికెట్ను సమర్పించాల్సిందిగా ఎమ్ఎమ్ఎల్ను పాకిస్థాన్ ఎన్నికల సంఘం కోరిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అంతకుముందు ఎమ్ఎమ్ఎల్ను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆ పార్టీకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అంతర్గత మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎమ్ఎమ్ఎల్ను 2017లో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్ స్థాపించాడు. పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని లాహోర్లో గత డిసెంబర్లో ప్రారంభించాడు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో తమపార్టీ పోటీ చేస్తుందని వెల్లడించాడు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







