ఆర్థిక కష్టాల్లో ఎయిర్ ఇండియా.. ఉద్యోగులకు అష్టకష్టాలు

- April 03, 2018 , by Maagulf
ఆర్థిక కష్టాల్లో ఎయిర్ ఇండియా.. ఉద్యోగులకు అష్టకష్టాలు

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రతి నెలాఖర్లోనే జీతాలు చెల్లించే సంస్థ మార్చి నెల జీతాలు ఇంత వరకు చెల్లించలేదు. దీంతో 11 వేల మంది శాశ్వత ఉద్యోగులతో పాటు 21 వేల మంది ఇతర ఉద్యోగులు జీతాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే గురువారం జీతాలు చెల్లించే అవకాశం ఉందని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. మరోవైపు తమ నియంత్రణలో లేని కొన్ని కారణాలతో మార్చి నెల జీతాలు చెల్లింపును వాయిదా వేసినట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com