యూఏఈ 44వ జాతీయ దినోత్సవ సందడి!
- December 02, 2015
యూఏఈ 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా, ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రజలకు పిలుపునిస్తూ, జాతీయ ఆర్థిక, విద్య, సామాజిక కార్యక్రమానికి సంబంధించిన 10 పాయింట్లపై ప్రచారం కల్పించేందుకు ర్యాలీలు తీయాలని కోరారు. అలాగే, దేశం కోసం ప్రాణాలకు ఒడ్డి పోరాడిన అమరవీరుల్ని స్మరించుకున్నారు. అమరవీరుల త్యాగాల్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు షేక్ ఖలీఫా. ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మాట్లాడుతూ, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఇతరుల పట్ల దయాగుణంతో ఉండాలనీ, అలాగే దేశం కోసం పోరాడాల్సి వస్తే ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ, దేశానికి యువశక్తి కీలకమనీ, దేశ అభివృద్ధిలో యువతదే అగ్ర తాంబూలమనీ అన్నారు. సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే యువతలో దాగి ఉన్న శక్తి బయటకు వస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







