యూఏఈ ఎన్నారైలకు స్వీట్ న్యూస్
- December 02, 2015
స్మార్ట్ సిటీస్, అమృత్ నగరాలు అనే న్యూ కాన్సెప్ట్తో ఇండియాలో నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలు విదేశాల్లోని ఎన్నారైలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊతం ఇచ్చింది. దుబాయ్ ట్రేడ్ సెంటర్లో మంగళవారం జరిగిన ప్రాపర్టీ షోలో ఎన్నారైలు సందడి చేశారు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్గా ఈ కార్యక్రమంలో నిలిచాడు. 170 మందికి పైగా డెవలపర్స్ 45 వేలకు పైగా ప్రాపర్టీస్ని ఎన్నారైల ముందుంచారు. రూపాయి బలహీన పడ్డంతో, ఇన్వెస్ట్మెంట్ తేలికవుతుందని ఓ ఎన్నారై అభిప్రాయపడ్డారు. మంగళవారం సాయంత్రం యూఏఈ దిర్హామ్తో రూపాయి ధరను పోల్చినప్పుడు ఒక దిర్హామ్ విలువ 18 రూపాయల 11 పైసలుగా ఉంది. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్లో డెవలపర్స్ ఎన్నారైలను ఆకట్టుకున్నారు. కొందరు ఇదే వేదికపై కొనుగోళ్ళు జరపడంతో డెవలపర్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









