యూఏఈ ఎన్నారైలకు స్వీట్‌ న్యూస్‌

- December 02, 2015 , by Maagulf
యూఏఈ ఎన్నారైలకు స్వీట్‌ న్యూస్‌


స్మార్ట్‌ సిటీస్‌, అమృత్‌ నగరాలు అనే న్యూ కాన్సెప్ట్‌తో ఇండియాలో నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలు విదేశాల్లోని ఎన్నారైలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొత్త ఊతం ఇచ్చింది. దుబాయ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో మంగళవారం జరిగిన ప్రాపర్టీ షోలో ఎన్నారైలు సందడి చేశారు. బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఈ కార్యక్రమంలో నిలిచాడు. 170 మందికి పైగా డెవలపర్స్‌ 45 వేలకు పైగా ప్రాపర్టీస్‌ని ఎన్నారైల ముందుంచారు. రూపాయి బలహీన పడ్డంతో, ఇన్వెస్ట్‌మెంట్‌ తేలికవుతుందని ఓ ఎన్నారై అభిప్రాయపడ్డారు. మంగళవారం సాయంత్రం యూఏఈ దిర్హామ్‌తో రూపాయి ధరను పోల్చినప్పుడు ఒక దిర్హామ్‌ విలువ 18 రూపాయల 11 పైసలుగా ఉంది. ఫ్లెక్సిబుల్‌ పేమెంట్‌ ఆప్షన్స్‌లో డెవలపర్స్‌ ఎన్నారైలను ఆకట్టుకున్నారు. కొందరు ఇదే వేదికపై కొనుగోళ్ళు జరపడంతో డెవలపర్స్‌ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com