యూఏఈ ఎన్నారైలకు స్వీట్ న్యూస్
- December 02, 2015
స్మార్ట్ సిటీస్, అమృత్ నగరాలు అనే న్యూ కాన్సెప్ట్తో ఇండియాలో నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలు విదేశాల్లోని ఎన్నారైలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊతం ఇచ్చింది. దుబాయ్ ట్రేడ్ సెంటర్లో మంగళవారం జరిగిన ప్రాపర్టీ షోలో ఎన్నారైలు సందడి చేశారు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్గా ఈ కార్యక్రమంలో నిలిచాడు. 170 మందికి పైగా డెవలపర్స్ 45 వేలకు పైగా ప్రాపర్టీస్ని ఎన్నారైల ముందుంచారు. రూపాయి బలహీన పడ్డంతో, ఇన్వెస్ట్మెంట్ తేలికవుతుందని ఓ ఎన్నారై అభిప్రాయపడ్డారు. మంగళవారం సాయంత్రం యూఏఈ దిర్హామ్తో రూపాయి ధరను పోల్చినప్పుడు ఒక దిర్హామ్ విలువ 18 రూపాయల 11 పైసలుగా ఉంది. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్లో డెవలపర్స్ ఎన్నారైలను ఆకట్టుకున్నారు. కొందరు ఇదే వేదికపై కొనుగోళ్ళు జరపడంతో డెవలపర్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







