కశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం
- April 12, 2018
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన ఆర్మీ జవాన్ సాద గుణాకరరావు కశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందాడు. అతడికి తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా మృత్యువాత పడడం ఆ తల్లిదండ్రులను కలచి వేస్తుంది. ఇంటర్ పూర్తయిన తరువాత 2012లో ఆర్మీలో చేరిన గుణాకర్ పంజాబ్లోని పఠాన్ కోట్ యూనిట్లో వెహికల్ డ్రైవర్గా పనిచేసేవాడు. అక్కడినుంచి శ్రీనగర్ రాష్ట్రీయ రైఫిల్ విభాగం-1కి బదిలీ అయ్యాడు. దగ్గరలోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో అందడంతో మంగళవారం రాత్రి 11.30 గంటలకు కొంతమంది సైనికులు అక్కడకు చేరుకున్నారు. వారిలో గుణాకర్ కూడా ఉన్నాడు. వీరు అక్కడకు చేరుకునే లోపే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో గుణాకర్ శరీరంలోకి తూటాలు దూసుకు వెళ్లాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుణాకర్ను ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారు ఝామున3.30 గంటలకు వీరమరణం చెందాడు. గుణాకర్ మరణ వార్త విని తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









