కశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం
- April 12, 2018
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన ఆర్మీ జవాన్ సాద గుణాకరరావు కశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందాడు. అతడికి తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా మృత్యువాత పడడం ఆ తల్లిదండ్రులను కలచి వేస్తుంది. ఇంటర్ పూర్తయిన తరువాత 2012లో ఆర్మీలో చేరిన గుణాకర్ పంజాబ్లోని పఠాన్ కోట్ యూనిట్లో వెహికల్ డ్రైవర్గా పనిచేసేవాడు. అక్కడినుంచి శ్రీనగర్ రాష్ట్రీయ రైఫిల్ విభాగం-1కి బదిలీ అయ్యాడు. దగ్గరలోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో అందడంతో మంగళవారం రాత్రి 11.30 గంటలకు కొంతమంది సైనికులు అక్కడకు చేరుకున్నారు. వారిలో గుణాకర్ కూడా ఉన్నాడు. వీరు అక్కడకు చేరుకునే లోపే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో గుణాకర్ శరీరంలోకి తూటాలు దూసుకు వెళ్లాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుణాకర్ను ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారు ఝామున3.30 గంటలకు వీరమరణం చెందాడు. గుణాకర్ మరణ వార్త విని తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







