కశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం
- April 12, 2018శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన ఆర్మీ జవాన్ సాద గుణాకరరావు కశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందాడు. అతడికి తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా మృత్యువాత పడడం ఆ తల్లిదండ్రులను కలచి వేస్తుంది. ఇంటర్ పూర్తయిన తరువాత 2012లో ఆర్మీలో చేరిన గుణాకర్ పంజాబ్లోని పఠాన్ కోట్ యూనిట్లో వెహికల్ డ్రైవర్గా పనిచేసేవాడు. అక్కడినుంచి శ్రీనగర్ రాష్ట్రీయ రైఫిల్ విభాగం-1కి బదిలీ అయ్యాడు. దగ్గరలోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో అందడంతో మంగళవారం రాత్రి 11.30 గంటలకు కొంతమంది సైనికులు అక్కడకు చేరుకున్నారు. వారిలో గుణాకర్ కూడా ఉన్నాడు. వీరు అక్కడకు చేరుకునే లోపే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో గుణాకర్ శరీరంలోకి తూటాలు దూసుకు వెళ్లాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుణాకర్ను ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారు ఝామున3.30 గంటలకు వీరమరణం చెందాడు. గుణాకర్ మరణ వార్త విని తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..