అసలే మ్యాచ్ పోయింది. ఆపై రూ.12 లక్షల ఫైన్
- April 26, 2018
ఐపీఎల్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ చేసినా చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. అసలే మ్యాచ్ పోయిన బాధతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉంటే. మూలుగే నక్కపై తాటిపండు పడ్డ చందగా విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా కెప్టెన్ కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్ వేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసినా. 82 పరుగులతో అంబటి రాయుడు, 70 పరుగులతో ఎంఎస్ ధోనీ చెలరేగడంతో చెన్నై విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద కనీస ఓవర్-రేట్కు సంబంధించి కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించినట్టు ప్రకటించింది ఐపీఎల్.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









