ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నఆటగాడికి మరో అరుదైన అవకాశం
- May 07, 2018
యువ క్రికెటర్ శ్రేయస్ మరో జాక్పాట్ కొట్టేస్తున్నాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ ఆటగాడిని ఆఫ్ఘనిస్తాన్తో తలపడడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్కి కోహ్లీ స్థానంలో శ్రేయస్ని ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఇదే జరిగితే శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో చోటు సంపాదించుకున్నట్లే. కోహ్లీ జూన్లో కౌంటీ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళుతున్నాడు. కౌంటీలో ఆరు మ్యాచ్లు ఆడేందుకు సర్రే జట్టుతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. జులైలో భారత జట్టు ఇంగ్లండులో పర్యటించనున్నందున కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ కారణంగానే ఆఫ్ఘాన్తో జరిగే మ్యాచ్కు కోహ్లీ దూరమవుతున్నాడు. దీంతో శ్రేయస్ పేరు తెరపైకి వచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ శ్రేయస్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







