ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నఆటగాడికి మరో అరుదైన అవకాశం
- May 07, 2018
యువ క్రికెటర్ శ్రేయస్ మరో జాక్పాట్ కొట్టేస్తున్నాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ ఆటగాడిని ఆఫ్ఘనిస్తాన్తో తలపడడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్కి కోహ్లీ స్థానంలో శ్రేయస్ని ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఇదే జరిగితే శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో చోటు సంపాదించుకున్నట్లే. కోహ్లీ జూన్లో కౌంటీ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళుతున్నాడు. కౌంటీలో ఆరు మ్యాచ్లు ఆడేందుకు సర్రే జట్టుతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. జులైలో భారత జట్టు ఇంగ్లండులో పర్యటించనున్నందున కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ కారణంగానే ఆఫ్ఘాన్తో జరిగే మ్యాచ్కు కోహ్లీ దూరమవుతున్నాడు. దీంతో శ్రేయస్ పేరు తెరపైకి వచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ శ్రేయస్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







