ఐపీఎల్‌లో కీలక మ్యాచ్...

- May 08, 2018 , by Maagulf
ఐపీఎల్‌లో కీలక మ్యాచ్...

ఐపీఎల్‌లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్ ఆడనుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన రాజస్థాన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ జట్టు నిష్క్రమించినట్టే. నిలకడ లేని బ్యాటింగ్, బౌలర్ల వైఫల్యంతో పాటు రహానే కెప్టెన్సీ కూడా రాయల్స్ ఓటములకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయాన్ని అందుకున్న పంజాబ్ తమ జోరు కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com