గల్ఫ్కు వెళ్లిన వారి చెక్కులు కుటుంబ సభ్యులకు అందజేస్తాం:మహమూద్ అలీ
- May 08, 2018
హైదరాబాద్: గల్ఫ్కు వెళ్లిన వాళ్ల రైతుబంధు చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కాబోయే రైతుబంధు పథకం చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై మహమూద్ అలీ స్పందిస్తూ.. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేస్తారన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. పంట సాయం కింద రైతులకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకం కోసం బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రైతుబంధు పథకం కింద 58.06 లక్షల చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇందుకోసం రూ. 5,608.09 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







