గల్ఫ్కు వెళ్లిన వారి చెక్కులు కుటుంబ సభ్యులకు అందజేస్తాం:మహమూద్ అలీ
- May 08, 2018
హైదరాబాద్: గల్ఫ్కు వెళ్లిన వాళ్ల రైతుబంధు చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కాబోయే రైతుబంధు పథకం చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై మహమూద్ అలీ స్పందిస్తూ.. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేస్తారన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. పంట సాయం కింద రైతులకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకం కోసం బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రైతుబంధు పథకం కింద 58.06 లక్షల చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇందుకోసం రూ. 5,608.09 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







