'నిపా సోకింది.. కొన్ని గంటల్లో చనిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త'... నర్సు లేఖ ఆఖరిమాటలు
- May 22, 2018
నిపా వైరస్ సోకింది. ఈ వైరస్ సోకితే చికిత్స లేదని తెలుసు. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. చివరిసారిగా మిమ్మల్ని, పిల్లలను కూడా చూడలేను అని తెలుసు. ఇది గుండెలను మరింత పిండేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మా నాన్నలా ఒంటరి జీవితాన్ని గడపకు అంటూ ఓ నర్సు తన భర్తకు రాసిన లేఖ ఇపుడు కేరళవాసులను కన్నీరు పెట్టిస్తోంది. నిపా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరిన రోగులకు చికిత్స చేస్తూ లినీ అనే నర్సు చనిపోయింది. అయితే, ఆమె చనిపోతూ భర్తకు రాసిన లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లేఖను చదివిన ప్రతి ఒక్కరూ కన్నీరుపెడుతున్నారు.
కేరళ రాష్ట్ర వాసులను నిపా వైరస్ వణికిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి 10 మంది వరకు మృత్యువాతపడ్డారు. మరికొంతమంది ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే, తాజాగా ఓ విషాదం జరిగింది. నిపా వైరస్ బారినపడిన రోగులకు చికిత్స చేస్తున్న ఓ నర్సు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ నర్సు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు చివరిచూపు చూడకుండానే ఖననం చేశారు.
అయితే, నర్సు లినీ.. మరికొద్దిసేపట్లో చనిపోతుంది అనగా తన భర్తకు రాసిన లేఖ వైరల్ అయింది. "నిపా వైరస్ రోగులకు చికిత్స చేస్తుండగా.. ఆ వైరస్ నాకు కూడా సోకింది. నాకు తెలుసు ఈ వైరస్కు చికిత్స లేదని. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. చివరిసారిగా మిమ్మల్ని, పిల్లలను కూడా చూడలేను అని తెలుసు. ఇది గుండెలను మరింత పిండేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వారిని గల్ఫ్ తీసుకెళ్లు. వారిని బాగా పెంచు. నేను లేను అని నీవు జీవితాంతం ఒంటరిగా ఉండకు. మా నాన్నలా నీ జీవితాన్ని ఒంటరితనం చేయొద్దు" అంటూ భర్తకు రాసిన లేఖ ఇప్పుడు అందరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది.
నిపా వైరస్కు చికిత్స చేస్తూ చనిపోయిన నర్సును వీరమరణం పొందిన వనితగా వైద్యులు, ప్రజలు కీర్తించారు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ సిన నర్సు దేశసరిహద్దులో పని చేసే జవాన్తో పోల్చారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







