'నిపా సోకింది.. కొన్ని గంటల్లో చనిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త'... నర్సు లేఖ ఆఖరిమాటలు
- May 22, 2018
నిపా వైరస్ సోకింది. ఈ వైరస్ సోకితే చికిత్స లేదని తెలుసు. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. చివరిసారిగా మిమ్మల్ని, పిల్లలను కూడా చూడలేను అని తెలుసు. ఇది గుండెలను మరింత పిండేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మా నాన్నలా ఒంటరి జీవితాన్ని గడపకు అంటూ ఓ నర్సు తన భర్తకు రాసిన లేఖ ఇపుడు కేరళవాసులను కన్నీరు పెట్టిస్తోంది. నిపా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరిన రోగులకు చికిత్స చేస్తూ లినీ అనే నర్సు చనిపోయింది. అయితే, ఆమె చనిపోతూ భర్తకు రాసిన లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లేఖను చదివిన ప్రతి ఒక్కరూ కన్నీరుపెడుతున్నారు.
కేరళ రాష్ట్ర వాసులను నిపా వైరస్ వణికిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి 10 మంది వరకు మృత్యువాతపడ్డారు. మరికొంతమంది ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే, తాజాగా ఓ విషాదం జరిగింది. నిపా వైరస్ బారినపడిన రోగులకు చికిత్స చేస్తున్న ఓ నర్సు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ నర్సు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు చివరిచూపు చూడకుండానే ఖననం చేశారు.
అయితే, నర్సు లినీ.. మరికొద్దిసేపట్లో చనిపోతుంది అనగా తన భర్తకు రాసిన లేఖ వైరల్ అయింది. "నిపా వైరస్ రోగులకు చికిత్స చేస్తుండగా.. ఆ వైరస్ నాకు కూడా సోకింది. నాకు తెలుసు ఈ వైరస్కు చికిత్స లేదని. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. చివరిసారిగా మిమ్మల్ని, పిల్లలను కూడా చూడలేను అని తెలుసు. ఇది గుండెలను మరింత పిండేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వారిని గల్ఫ్ తీసుకెళ్లు. వారిని బాగా పెంచు. నేను లేను అని నీవు జీవితాంతం ఒంటరిగా ఉండకు. మా నాన్నలా నీ జీవితాన్ని ఒంటరితనం చేయొద్దు" అంటూ భర్తకు రాసిన లేఖ ఇప్పుడు అందరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది.
నిపా వైరస్కు చికిత్స చేస్తూ చనిపోయిన నర్సును వీరమరణం పొందిన వనితగా వైద్యులు, ప్రజలు కీర్తించారు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ సిన నర్సు దేశసరిహద్దులో పని చేసే జవాన్తో పోల్చారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









