సౌదీఅరేబియో ఎయిర్ లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..53 మందికి గాయాలు

- May 22, 2018 , by Maagulf
సౌదీఅరేబియో ఎయిర్ లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..53 మందికి గాయాలు

రియాద్:సౌదీఅరేబియో ఎయిర్ లైన్స్ విమానాన్ని జెడ్డాలోని వెస్టర్న్ రెడ్ సీ సిటీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఎయిర్‌బస్ ఏ330 హైడ్రాలిక్ యంత్రంలో సమస్య రావడంతో.. రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో అదుపుతప్పింది. దీంతో రన్‌వేపై మంటలు చెలరేగాయి. ప్రయాణికులను అత్యవసర మార్గం ద్వారా కాపాడే క్రమంలో 53 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. విమానం 151 మంది ప్రయాణికులతో మదీనా నుంచి ఢాకాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com