మరో చిత్రానికి హీరో ధనుష్ దర్శకత్వం
- May 23, 2018'పవర్పాండి' చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. సీనియర్ నటుడు రాజ్కిరణ్తో ధనుష్ చేసిన 'పవర్పాండి' కమర్షియల్ సక్సెస్తో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దాంతో, ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో 'పవర్ పాండి'కి సీక్వెల్ తీయబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, హాలీవుడ్ చిత్రంలో ధనుష్ బిజీ అవడంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో నటిస్తుండడం వల్ల మెగాఫోన్కు దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ధనుష్ మరోసారి దర్శకత్వం వహించేందుకు సన్నా హాలు చేపట్టినట్టు కోలీవుడ్ టాక్. వచ్చే నెలలోనే ఆ సినిమా ప్రారం భమయ్యే అవకాశముందని చెప్పు కుంటున్నారు. అయితే, వేరే ఆ సినిమాలో వేరే హీరో నటిస్తారా లేక ధనుష్ నటిస్తారా అన్నది ఇంకా తెలియలేదు. కాగా, ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' జూలైలో తెరపైకి రానుంది.
తాజా వార్తలు
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!