మరో చిత్రానికి హీరో ధనుష్ దర్శకత్వం
- May 23, 2018
'పవర్పాండి' చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. సీనియర్ నటుడు రాజ్కిరణ్తో ధనుష్ చేసిన 'పవర్పాండి' కమర్షియల్ సక్సెస్తో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దాంతో, ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో 'పవర్ పాండి'కి సీక్వెల్ తీయబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, హాలీవుడ్ చిత్రంలో ధనుష్ బిజీ అవడంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో నటిస్తుండడం వల్ల మెగాఫోన్కు దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ధనుష్ మరోసారి దర్శకత్వం వహించేందుకు సన్నా హాలు చేపట్టినట్టు కోలీవుడ్ టాక్. వచ్చే నెలలోనే ఆ సినిమా ప్రారం భమయ్యే అవకాశముందని చెప్పు కుంటున్నారు. అయితే, వేరే ఆ సినిమాలో వేరే హీరో నటిస్తారా లేక ధనుష్ నటిస్తారా అన్నది ఇంకా తెలియలేదు. కాగా, ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' జూలైలో తెరపైకి రానుంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









