అబుధాబి:మెయిడ్‌ మొహంపై వేడి నీళ్ళను పోసిన మహిళ

- May 24, 2018 , by Maagulf
అబుధాబి:మెయిడ్‌ మొహంపై వేడి నీళ్ళను పోసిన మహిళ

అబుధాబి:ముగ్గురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ, మెయిడ్‌పై వేడి నీళ్ళు పోసిన కేసులో విచారణ జరుగుతోంది. అబుధాబికి చెందిన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. మెయిడ్‌, తన చిన్నారుల్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ, నిందితురాలు ఈ ఘటనకు పాల్పడింది. అయితే, తనపై నేరాభియోగాలను తప్పుపడ్తోంది నిందితురాలు. కాగా, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ఆరోపణలు నిజమేనని వాటిల్లో ధృవీకరణ జరిగింది. ఈ కేసు విచారణను జూన్‌ 27వ తేదీకి వాయిదా వేసింది అబుదాబీ కోర్ట్‌ ఆఫ్‌ అపీల్స్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com