బహ్రెయిన్‌:కుమారుడి మృతదేహం రాకముందే తల్లి మృతి

- May 31, 2018 , by Maagulf
బహ్రెయిన్‌:కుమారుడి మృతదేహం రాకముందే తల్లి మృతి

బహ్రెయిన్‌:బహ్రెయిన్‌లో 30 ఏళ్ళుగా నివసిస్తూ ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన సుకు నడరాజన్‌ (50) ఇటీవల మరణించగా, అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే ఆమె తల్లి మృతి చెందడం అందర్నీ కలచివేసింది. తీవ్రమైన గుండెపోటుతో సుకు తల్లి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మే 15న తీవ్ర అనారోగ్యంతో సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ ఆసుపత్రిలో సుకు నడరాజన్‌ ప్రాణాలు యకోల్పోయారు. బహ్రెయిన్‌లో సోషల్‌ వర్కర్స్‌ సుకు మృతదేహాన్ని ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బహ్రెయిన్‌ నుంచి ఇండియాలోని ఎయిర్‌పోర్ట్‌కి సుకు మృతదేహం చేరుకోవడానికి ముందే అతని తల్లి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి మీద బెంగతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com