యుపి:దుమ్ముతుఫాను దాటికి 15మంది మృతి
- June 02, 2018
లక్నో:ఉత్తరప్రదేశ్లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ దుమ్ము తుఫాను ధాటికి 15మంది మృతి చెందగా, మరో తొమ్మిది మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువమంది చెట్లుకూలడం, ఇళ్లు కూలిపోవడంతో మృతి చెందినట్లు యుపి అధికార ప్రతినిధి శనివారం వెల్లడించారు. మొర్దాబాద్లో ప్రారంభమైన తుఫానుకు జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందగా, సంబాల్లో మరో ముగ్గురు మృతిచెందినట్లు ఆయన పేర్కొన్నారు. ముజఫర్నగర్, మీరట్, అమరోహాలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. 24 గంటలలోగా విపత్తు నివారణా చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లను ఆదేశించింది. గతనెలలో సంభవించిన మూడు భారీ దుమ్ముతుఫానుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 130మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







