యుపి:దుమ్ముతుఫాను దాటికి 15మంది మృతి
- June 02, 2018
లక్నో:ఉత్తరప్రదేశ్లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ దుమ్ము తుఫాను ధాటికి 15మంది మృతి చెందగా, మరో తొమ్మిది మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువమంది చెట్లుకూలడం, ఇళ్లు కూలిపోవడంతో మృతి చెందినట్లు యుపి అధికార ప్రతినిధి శనివారం వెల్లడించారు. మొర్దాబాద్లో ప్రారంభమైన తుఫానుకు జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందగా, సంబాల్లో మరో ముగ్గురు మృతిచెందినట్లు ఆయన పేర్కొన్నారు. ముజఫర్నగర్, మీరట్, అమరోహాలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. 24 గంటలలోగా విపత్తు నివారణా చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లను ఆదేశించింది. గతనెలలో సంభవించిన మూడు భారీ దుమ్ముతుఫానుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 130మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







