యుపి:దుమ్ముతుఫాను దాటికి 15మంది మృతి

- June 02, 2018 , by Maagulf
యుపి:దుమ్ముతుఫాను దాటికి 15మంది మృతి

లక్నో:ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ దుమ్ము తుఫాను ధాటికి 15మంది మృతి చెందగా, మరో తొమ్మిది మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువమంది చెట్లుకూలడం, ఇళ్లు కూలిపోవడంతో మృతి చెందినట్లు యుపి అధికార ప్రతినిధి శనివారం వెల్లడించారు. మొర్దాబాద్‌లో ప్రారంభమైన తుఫానుకు జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందగా, సంబాల్‌లో మరో ముగ్గురు మృతిచెందినట్లు ఆయన పేర్కొన్నారు. ముజఫర్‌నగర్‌, మీరట్‌, అమరోహాలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. 24 గంటలలోగా విపత్తు నివారణా చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లను ఆదేశించింది. గతనెలలో సంభవించిన మూడు భారీ దుమ్ముతుఫానుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 130మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com