దావూద్ రెస్టారెంట్ రూ.4.28కోట్లు..!
- December 09, 2015
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులకు ఈ రోజు ముంబయిలో వేలం నిర్వహించారు. ముంబయిలో దావూద్కు చెందిన రెస్టారెంట్ను మాజీ జర్నలిస్టు ఎస్.బాలకృష్ణన్ రూ.4.28కోట్లకు కొనుక్కున్నారు. 1993 ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం దశాబ్దం క్రితమే ముంబయిలో అనేక కోట్ల విలువ చేసే ఆస్తులను వదిలేసి పారిపోయాడు.ఇప్పటికే కొన్ని ఆస్తులను వేలం వేయగా మరికొన్ని మిగిలి ఉన్నాయి. దావూద్ ఉపయోగించిన గ్రీన్ హ్యుందాయ్ ఎసెంట్ సెడాన్ కారును కూడా వేలంలో ఉంచారు. ఆ కారు ధరను కేవలం రూ.4వేలుగా నిర్ణయించారు. దావూద్ భయంతో చాలా మంది కొనడానికి ముందుకు రావడం లేదు. ఈరోజు వేలంలో రెస్టారెంట్ను కొనుగోలు చేసిన బాలకృష్ణన్ ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. ఈ రెస్టారెంట్ను మార్చేసి పేద విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ సెంటర్ నడపడానికి దీనిని కొన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







