దావూద్ రెస్టారెంట్ రూ.4.28కోట్లు..!
- December 09, 2015
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులకు ఈ రోజు ముంబయిలో వేలం నిర్వహించారు. ముంబయిలో దావూద్కు చెందిన రెస్టారెంట్ను మాజీ జర్నలిస్టు ఎస్.బాలకృష్ణన్ రూ.4.28కోట్లకు కొనుక్కున్నారు. 1993 ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం దశాబ్దం క్రితమే ముంబయిలో అనేక కోట్ల విలువ చేసే ఆస్తులను వదిలేసి పారిపోయాడు.ఇప్పటికే కొన్ని ఆస్తులను వేలం వేయగా మరికొన్ని మిగిలి ఉన్నాయి. దావూద్ ఉపయోగించిన గ్రీన్ హ్యుందాయ్ ఎసెంట్ సెడాన్ కారును కూడా వేలంలో ఉంచారు. ఆ కారు ధరను కేవలం రూ.4వేలుగా నిర్ణయించారు. దావూద్ భయంతో చాలా మంది కొనడానికి ముందుకు రావడం లేదు. ఈరోజు వేలంలో రెస్టారెంట్ను కొనుగోలు చేసిన బాలకృష్ణన్ ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. ఈ రెస్టారెంట్ను మార్చేసి పేద విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ సెంటర్ నడపడానికి దీనిని కొన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







