దావూద్ రెస్టారెంట్ రూ.4.28కోట్లు..!
- December 09, 2015
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులకు ఈ రోజు ముంబయిలో వేలం నిర్వహించారు. ముంబయిలో దావూద్కు చెందిన రెస్టారెంట్ను మాజీ జర్నలిస్టు ఎస్.బాలకృష్ణన్ రూ.4.28కోట్లకు కొనుక్కున్నారు. 1993 ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం దశాబ్దం క్రితమే ముంబయిలో అనేక కోట్ల విలువ చేసే ఆస్తులను వదిలేసి పారిపోయాడు.ఇప్పటికే కొన్ని ఆస్తులను వేలం వేయగా మరికొన్ని మిగిలి ఉన్నాయి. దావూద్ ఉపయోగించిన గ్రీన్ హ్యుందాయ్ ఎసెంట్ సెడాన్ కారును కూడా వేలంలో ఉంచారు. ఆ కారు ధరను కేవలం రూ.4వేలుగా నిర్ణయించారు. దావూద్ భయంతో చాలా మంది కొనడానికి ముందుకు రావడం లేదు. ఈరోజు వేలంలో రెస్టారెంట్ను కొనుగోలు చేసిన బాలకృష్ణన్ ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. ఈ రెస్టారెంట్ను మార్చేసి పేద విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ సెంటర్ నడపడానికి దీనిని కొన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









