అల్లా ఆశీస్సుల కోసం 4 ఏళ్ల చిన్నారిని చంపిన తండ్రి ...
- June 10, 2018
స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే చాలు దేవుడు సంతృప్తి చెందుతాడు. బరువైన కానుకల్ని, బలిదానాలను కోరుకోడు. కానీ చాలా ప్రాంతాల్లో ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాల వెంట పరిగెడుతూ దేవుడికి మొక్కుల పేరుతో బలి ఇస్తున్నారు. జంతువులను బలి ఇవ్వడం ఒక ఎత్తైతే, మనుషుల్ని అందునా పసి బిడ్డల్ని అన్యాయంగా బలి చేస్తున్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రమైన రంజాన్ మాసపు రోజులు చాలా కీలకం. అత్యంత నిష్టగా రోజాని ఆచరిస్తూ భక్తి శ్రద్దలతో అల్లాని ప్రార్థిస్తారు. రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పిపార్సిటీ పట్టణానికి చెందిన నవాబ్ అలీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం జూన్ 7 రాత్రి కుటుంబసభ్యులంతా మేడపైన నిద్రిస్తున్నారు. ఉదయం లేచే సరికి పెద్ద కుమార్తె 4 ఏళ్ల రిజ్వానా కనిపించలేదు. అమ్మ లేపితే గాని లెగని బిడ్డ ఎక్కడి వెళ్లిందా అని కంగారు పడ్డ తల్లి కిందికి వెళ్లి చూసింది. పెరట్లో నిర్జీవంగా పడి ఉన్న రిజ్వానాను చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. భోరున విలపిస్తూ భర్తకు వచ్చి చెప్పింది. అయ్యో.. అని బాధపడుతున్నాడే కానీ కొంత తడబాటు కనిపించి అతడిలో.
చుట్టు పక్కల స్థానికులకూ అతడిపైనే అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అలీని విచారించగా అసలు విషయం బయటపడింది. గురువారం ఉదయం రిజ్వానాను అలీ బయటకు తీసుకువెళ్లి పాప అడిగిన వన్నీ కొని ఇచ్చాడు. అర్థరాత్రి దాటాక పాపను కిందకు తీసుకువచ్చి ఒడిలో కూర్చోబెట్టకున్నాడు. ఖురాన్ చదివి అల్లాను ప్రార్థిస్తూ ఒడిలో ఉన్న బిడ్డ మెడను కత్తితో కోసి చంపేసాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మేడపైకి వెళ్లి పడుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. పోలీసులు పాపను అత్యంత దారుణంగా హత్య చేసినందుకుగాను అలీని అరెస్టు చేసారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..