అల్లా ఆశీస్సుల కోసం 4 ఏళ్ల చిన్నారిని చంపిన తండ్రి ...
- June 10, 2018
స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే చాలు దేవుడు సంతృప్తి చెందుతాడు. బరువైన కానుకల్ని, బలిదానాలను కోరుకోడు. కానీ చాలా ప్రాంతాల్లో ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాల వెంట పరిగెడుతూ దేవుడికి మొక్కుల పేరుతో బలి ఇస్తున్నారు. జంతువులను బలి ఇవ్వడం ఒక ఎత్తైతే, మనుషుల్ని అందునా పసి బిడ్డల్ని అన్యాయంగా బలి చేస్తున్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రమైన రంజాన్ మాసపు రోజులు చాలా కీలకం. అత్యంత నిష్టగా రోజాని ఆచరిస్తూ భక్తి శ్రద్దలతో అల్లాని ప్రార్థిస్తారు. రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పిపార్సిటీ పట్టణానికి చెందిన నవాబ్ అలీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం జూన్ 7 రాత్రి కుటుంబసభ్యులంతా మేడపైన నిద్రిస్తున్నారు. ఉదయం లేచే సరికి పెద్ద కుమార్తె 4 ఏళ్ల రిజ్వానా కనిపించలేదు. అమ్మ లేపితే గాని లెగని బిడ్డ ఎక్కడి వెళ్లిందా అని కంగారు పడ్డ తల్లి కిందికి వెళ్లి చూసింది. పెరట్లో నిర్జీవంగా పడి ఉన్న రిజ్వానాను చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. భోరున విలపిస్తూ భర్తకు వచ్చి చెప్పింది. అయ్యో.. అని బాధపడుతున్నాడే కానీ కొంత తడబాటు కనిపించి అతడిలో.
చుట్టు పక్కల స్థానికులకూ అతడిపైనే అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అలీని విచారించగా అసలు విషయం బయటపడింది. గురువారం ఉదయం రిజ్వానాను అలీ బయటకు తీసుకువెళ్లి పాప అడిగిన వన్నీ కొని ఇచ్చాడు. అర్థరాత్రి దాటాక పాపను కిందకు తీసుకువచ్చి ఒడిలో కూర్చోబెట్టకున్నాడు. ఖురాన్ చదివి అల్లాను ప్రార్థిస్తూ ఒడిలో ఉన్న బిడ్డ మెడను కత్తితో కోసి చంపేసాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మేడపైకి వెళ్లి పడుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. పోలీసులు పాపను అత్యంత దారుణంగా హత్య చేసినందుకుగాను అలీని అరెస్టు చేసారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







