హింసాత్మక దాడులతో అల్లకల్లోలం సృష్టించాలంటూ..
- June 25, 2018
ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ మరోసారి భారత్పై బహిరంగంగా విషం కక్కాడు... హింసాత్మక దాడులతో కశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించాలంటూ ముష్కరమూకలకు పిలుపునిచ్చాడు. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కొత్త శకం ప్రారంభమైందని.. దేవుడి దయతో కాశ్మీర్ స్వతంత్ర దేశంగా అవతరించనుందన్నారు.
కశ్మీర్లో రక్తం పారుతోందని, దేవుడు చూస్తున్నాడని, ఆయన త్వరలోనే తీర్పు చెబుతాడన్నాడు. ఎందుకంటే నిర్ణయాలన్నీ పైనుంచే వస్తాయని.. వాషింగ్టన్ నుంచి కాదన్నాడు. కశ్మీర్కు స్వాతంత్ర్యం రావడం ప్రపంచం కళ్లారా చూస్తుందని… భారత భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్నవాళ్లను ‘అల్లా’ చూస్తున్నాడు పేర్కొన్నాడు. వాళ్లు చనిపోతూ కూడా పాకిస్తాన్, కశ్మీర్ ఐక్యత గురించి మాట్లాడుతున్నారని... కశ్మీర్లో ఇది నూతన శకమని... మోదీ దానిని అడ్డుకోలేరంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.కశ్మీర్లో జరిగే అనేక ఉగ్రదాడుల వెనక లష్కరేతొయిబా హస్తం ఉంది. అలాగే స్థానిక యువతను భద్రతా సిబ్బంది మీద రాళ్లు విసిరేలా అది ప్రోత్సహిస్తోంది. పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ సర్వీస్తో దీనికి సంబంధాలున్నాయి. జామత్ ఉద్ దవా పార్టీ ద్వారా ఎన్నికల్లో గెలుపొంది పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో పాగా వేయాలని భావిస్తున్నాడు సయీద్. అతడి కుమారుడు, అల్లుడితో కలిపి మొత్తం 265 సీట్లలో అతడి పార్టీ పోటీ చేస్తోంది. జులై 25న పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







