రెండో స్థానంలో హువ్వావే
- August 01, 2018
అమెరికాకి చెందిన అగ్రశ్రేణి టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన స్థానం కోల్పోయింది. చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ హువావీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. జూన్ తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ప్రపంచంలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు అమ్మిన రెండో కంపెనీగా హువావీ అవతరించింది. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న యాపిల్ మూడో స్థానానికి పడిపోయింది. యూరప్, చైనాలో విస్తరించడంతో హువావీ ఈ ఫీట్ సాధించింది. మొదటి స్థానంలో కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన స్థానాన్ని కాపాడుకోగలిగింది.
ప్రపంచ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ చైనాలో కొద్ది కాలంగా మందగించిన అమ్మకాలు తీరిగి పుంజుకున్నాయి. దీంతో స్వదేశంలో హువావీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జోరుగా సాగాయి. దీనికి తోడు ఫీచర్ ఫోన్ల అమ్మకాల్లో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది హువావీ. ఇటీవల మూడు కెమెరాలతో మార్కెట్లో ప్రవేశపెట్టిన హువావీ పీ20 ప్రో స్మార్ట్ ఫోన్ ఇతర కంపెనీల మార్కెట్ ను కొల్లగొట్టిందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2018 మొదటి అర్థభాగంలో 15 శాతం అధికంగా ఆదాయం ఆర్జించినట్టు హువావీ తెలిపింది.
ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో హువావీ ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 15 శాతాని కంటే ఎక్కువ భాగాన్ని సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే కాలంలో యాపిల్ దాదాపుగా 12 శాతం మార్కెట్ మాత్రమే దక్కించుకోగలిగింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సుమారు 20 శాతం మార్కెట్ షేర్ సాధించింది. అయితే అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలు హువావీ స్మార్ట్ ఫోన్ల ద్వారా చైనా ప్రభుత్వం గూఢచర్యం జరుపుతోందని ఆరోపించాయి. దీంతో ఆయా దేశాల్లో మార్కెట్ కోల్పోతున్న దృష్ట్యా హువావీకి చైనా మార్కెట్ ఎంతో కీలకంగా మారింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







