కువైట్‌-హైదరాబాద్‌ విమానంలో మంటలు

- August 01, 2018 , by Maagulf
కువైట్‌-హైదరాబాద్‌ విమానంలో మంటలు

శంషాబాద్‌ విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. కువైట్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. దీంతో విమానంలో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కువైట్‌ నుంచి వస్తున్న జెజిర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అర్ధరాత్రి 1.30 నిమిషాల సమయంలో నగరానికి చేరుకుంది. రన్‌ వేపై దిగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం ఇంజిన్‌ నుంచి మంటలు రావడంతో పైలట్ సకాలంలో నిలిపి విమానంలోని 149 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించివేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com