పెటియం ద్వారా విమాన టిక్కెట్లు బుక్ చేస్తే డిస్కౌంట్
- August 08, 2018
భారతీయ అతి పెద్ద ఎయిర్లైన్ మార్కెట్ వాటా కలిగిన ఇండిగో ఒక లాభదాయకమైన ఆఫర్ను ప్రకటించింది. దేశీయ క్యారియర్ పెటియం ద్వారా టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి ఫ్లాట్ 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.
ఇండిగో యొక్క వెబ్ సైట్ మరియు మొబైల్ అప్లికేషన్ లో, One97 కమ్యూనికేషన్స్ 'పెటియం యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి.ఐతే ముఖ్యంగా, వినియోగదారులు 10% క్యాష్ బ్యాక్ అంటే గరిష్టంగా రూ .500 వరకు పొందవచ్చు.
కంపెనీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నిబంధనల ప్రకారం, ఆఫర్ పొందేందుకు కనీస బుకింగ్ విలువ రూ .2,500 రూపాయలు ఉండాలి అలాగే ప్రమోషన్ వ్యవధిలో ఒకసారి మాత్రమే ఆఫర్ పొందడం కోసం కస్టమర్కు అనుమతి ఉంటుంది. బుకింగ్ సమయం నుండి 7 పని దినాల్లో క్యాష్ బ్యాక్ కస్టమర్ యొక్క Paytm ఖాతాకు క్రెడిట్ చేయబడుతుంది, "అని సంస్థ యొక్క వెబ్సైట్ తెలిపింది.
ఇదిలా ఉండగా 'యూరోప్ ఆన్ సేల్' పథకం కింద, జెట్ ఎయిర్వేస్ విమాన టిక్కెట్లపై 30% తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ పొందేందుకు, ప్రయాణికులకు ఆగస్టు 17, 2018 వరకు విమాన టిక్కెట్లను కొనే అవకాశం ఉంటుందని కంపెనీ వెబ్సైట్ తెలిపింది.
ఈ త్రైమాసికంలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లాభాలలో 73.3 శాతం క్షీణించి 117.6 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.ఇండెక్స్ యొక్క త్రైమాసిక ఫలితాలు గత మూడేళ్లలో చాల క్షిణించాయి,ప్రధానంగా ప్రతికూల విదేశీ మారకం, అధిక ఇంధన వ్యయాలు మరియు పోటీతత్వ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







