దివంగత మాజీ సీఎం కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం
- August 08, 2018
చెన్నై:ద్రవిడ ఉద్యమ నేత.. దివంగత మాజీ సీఎం కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజాజీ హాల్ నుంచి ఈ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఐదు గంటల తరువాత మెరీనా బీచ్లో కరుణానిధి భౌతిక కాయానికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కరుణానిధి చివరి చూపు కోసం రాజాజీ హాల్కు భారీగా అభిమానులు చేరుకున్నారు. తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తమ ప్రియతమ నేతను చివరి సారి దగ్గర నుంచి చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. కొందరు అత్యూత్సాహంగా బారికేడ్లు దాటి భౌతిక కాయం దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేశారు.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా.. 30 మందికిపైగా గాయాలు అయ్యాయి…
కరుణానిధి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం అవ్వడం లేదు. మరోవైపు అదే సమయంలో ప్రముఖులు సైతం భారీగా వచ్చి.. కరుణానిధి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.. దీంతో భద్రత కల్పించండం పోలీసులకు ఇబ్బందిగా మారింది..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







