దివంగత మాజీ సీఎం కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం

- August 08, 2018 , by Maagulf
దివంగత మాజీ సీఎం కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం

చెన్నై:ద్రవిడ ఉద్యమ నేత.. దివంగత మాజీ సీఎం కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజాజీ హాల్‌ నుంచి ఈ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఐదు గంటల తరువాత మెరీనా బీచ్‌లో కరుణానిధి భౌతిక కాయానికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కరుణానిధి చివరి చూపు కోసం రాజాజీ హాల్‌కు భారీగా అభిమానులు చేరుకున్నారు. తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తమ ప్రియతమ నేతను చివరి సారి దగ్గర నుంచి చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. కొందరు అత్యూత్సాహంగా బారికేడ్లు దాటి భౌతిక కాయం దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేశారు.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా.. 30 మందికిపైగా గాయాలు అయ్యాయి…

కరుణానిధి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం అవ్వడం లేదు. మరోవైపు అదే సమయంలో ప్రముఖులు సైతం భారీగా వచ్చి.. కరుణానిధి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.. దీంతో భద్రత కల్పించండం పోలీసులకు ఇబ్బందిగా మారింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com