ప్రవాసులు స.హ.చ దరఖాస్తుకు అనర్హులు:జితేంద్రసింగ్‌

- August 08, 2018 , by Maagulf
ప్రవాసులు స.హ.చ దరఖాస్తుకు అనర్హులు:జితేంద్రసింగ్‌

ఢిల్లీ: సాధారణంగా ప్రభుత్వ పాలనా యంత్రాంగం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏదైనా సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రవాసులకు ఆ వెసులుబాటు లేదని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖిత్వ పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 'సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం.. కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకునే హక్కు ఉంటుంది. ప్రవాసులకు ఇందుకు అర్హులు కారు' అని జితేంద్రసింగ్‌ తెలిపారు. అంతేగాక.. సహచట్టం ద్వారా సమాచారం పొందాలనుకునే వారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉందని వెల్లడించారు. www.rtionline.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి అందులోని కావాల్సిన మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ విభాగాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తును నింపొచ్చని జితేంద్రసింగ్‌ తెలిపారు. ప్రస్తుతం 2,200 ప్రభుత్వ విభాగాల వద్ద ఈ ఆన్‌లైన్‌ దరఖాస్తులను పరిశీలించే వ్యవస్థ ఉందని చెప్పారు. ఈ దరఖాస్తులకు రుసుము కూడా ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలని కేంద్రమంత్రి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com