కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- November 09, 2025
కువైట్: కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కీలక రంగాలలో కువైట్ మరియు కేరళ మధ్య సహకారాన్ని పెంపొందించడంపై ఈ సందర్భంగా దృష్టి సారించారు.
భారత్ మరియు కువైట్ మధ్య దీర్ఘకాల చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా కేరళ కమ్యూనిటీ కువైట్ అభివృద్ధికి అందించిన అమూల్యమైన సహకారాన్ని షేక్ ఫహద్ ప్రశంసించారు. కేరళ కమ్యూనిటీ పట్ల కువైట్ కు ఉన్న సాన్నిహిత్యానికి కేరళ ముఖ్యమంత్రి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు.
కేరళలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి త్వరలో కువైట్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కేరళను సందర్శిస్తుందని షేక్ మెషాల్ ప్రకటించారు. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఖలీఫా అబ్దుల్లా దహి అల్-అజిల్ అల్-అస్కర్తో కూడా కేరళ సీం సమావేశం నిర్వహించి కేరళ లో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను వివరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









