విజయవాడ:వ్యభిచారం పేరుతో ఆన్లైన్ మోసం
- August 15, 2018
విజయవాడ:పేరుతో ఆన్లైన్లో వల వేసి మగాళ్లను మోసం చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. సోషల్ మీడియాలో యువతుల ఫొటోలతో ఫేక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా అబ్బాయిలకు ఎరవేసి వాళ్లను ఛీట్ చేస్తున్నారు. ఇప్పటికి 5 అకౌంట్ల ద్వారా చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. దాదాపు 20 లక్షల వరకూ వసూలు చేసినట్టు గుర్తించారు. ఇటీవల ఈ ముఠా విజయవాడకు చెందిన ఓ యువతి ఫొటోతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయడంతో.. స్నేహితుల ద్వారా బాధితురాలికి విషయం తెలిసింది. వెంటనే షాక్కి గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. గుంటూరుకు చెందిన రాజేశ్వరి అనే మహిళతోపాటు ఆమె అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా వీళ్లు ఈ తరహా దందా చేస్తున్నట్టు నిర్థారణ కావడంతో.. 420 సెక్షన్ కింద కేసు పెట్టడంతోపైటు, సైబర్ చట్టాల కింద కూడా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







