విజయవాడ:వ్యభిచారం పేరుతో ఆన్లైన్ మోసం
- August 15, 2018
విజయవాడ:పేరుతో ఆన్లైన్లో వల వేసి మగాళ్లను మోసం చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. సోషల్ మీడియాలో యువతుల ఫొటోలతో ఫేక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా అబ్బాయిలకు ఎరవేసి వాళ్లను ఛీట్ చేస్తున్నారు. ఇప్పటికి 5 అకౌంట్ల ద్వారా చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. దాదాపు 20 లక్షల వరకూ వసూలు చేసినట్టు గుర్తించారు. ఇటీవల ఈ ముఠా విజయవాడకు చెందిన ఓ యువతి ఫొటోతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయడంతో.. స్నేహితుల ద్వారా బాధితురాలికి విషయం తెలిసింది. వెంటనే షాక్కి గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. గుంటూరుకు చెందిన రాజేశ్వరి అనే మహిళతోపాటు ఆమె అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా వీళ్లు ఈ తరహా దందా చేస్తున్నట్టు నిర్థారణ కావడంతో.. 420 సెక్షన్ కింద కేసు పెట్టడంతోపైటు, సైబర్ చట్టాల కింద కూడా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







