విజయవాడ:వ్యభిచారం పేరుతో ఆన్లైన్ మోసం
- August 15, 2018విజయవాడ:పేరుతో ఆన్లైన్లో వల వేసి మగాళ్లను మోసం చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. సోషల్ మీడియాలో యువతుల ఫొటోలతో ఫేక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా అబ్బాయిలకు ఎరవేసి వాళ్లను ఛీట్ చేస్తున్నారు. ఇప్పటికి 5 అకౌంట్ల ద్వారా చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. దాదాపు 20 లక్షల వరకూ వసూలు చేసినట్టు గుర్తించారు. ఇటీవల ఈ ముఠా విజయవాడకు చెందిన ఓ యువతి ఫొటోతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయడంతో.. స్నేహితుల ద్వారా బాధితురాలికి విషయం తెలిసింది. వెంటనే షాక్కి గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. గుంటూరుకు చెందిన రాజేశ్వరి అనే మహిళతోపాటు ఆమె అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా వీళ్లు ఈ తరహా దందా చేస్తున్నట్టు నిర్థారణ కావడంతో.. 420 సెక్షన్ కింద కేసు పెట్టడంతోపైటు, సైబర్ చట్టాల కింద కూడా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం