విజయవాడ:వ్యభిచారం పేరుతో ఆన్లైన్ మోసం
- August 15, 2018
విజయవాడ:పేరుతో ఆన్లైన్లో వల వేసి మగాళ్లను మోసం చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. సోషల్ మీడియాలో యువతుల ఫొటోలతో ఫేక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా అబ్బాయిలకు ఎరవేసి వాళ్లను ఛీట్ చేస్తున్నారు. ఇప్పటికి 5 అకౌంట్ల ద్వారా చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. దాదాపు 20 లక్షల వరకూ వసూలు చేసినట్టు గుర్తించారు. ఇటీవల ఈ ముఠా విజయవాడకు చెందిన ఓ యువతి ఫొటోతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయడంతో.. స్నేహితుల ద్వారా బాధితురాలికి విషయం తెలిసింది. వెంటనే షాక్కి గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. గుంటూరుకు చెందిన రాజేశ్వరి అనే మహిళతోపాటు ఆమె అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా వీళ్లు ఈ తరహా దందా చేస్తున్నట్టు నిర్థారణ కావడంతో.. 420 సెక్షన్ కింద కేసు పెట్టడంతోపైటు, సైబర్ చట్టాల కింద కూడా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!