అబుధాబిలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- August 15, 2018 , by Maagulf

అబుధాబి:72వ భారత స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా భారతీయ వలసదారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యూఏఈలో భారత రాయబారి నవదీప్‌ సింగ్‌ సూరి, జాతీయ గీతాలాపన జరుగుతుండగా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అబుదాబీలోని ఇండియన్‌ ఎంబసీ వద్ద పెద్దయెత్తున రెసిడెంట్స్‌ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12.30 నిమిషాల వరకు ఓపెన్‌ హౌస్‌ నిర్వహిస్తున్నందున, ప్రత్యేకమైన అపాయింట్‌మెంట్‌ ఏమీ అవసరం లేదని ఎంబసీ పేర్కొంది. అమ్నెస్టీని పొంది, యూఏఈలో తమ నివాసాన్ని లీగల్‌ చేసుకోవచ్చుని ఈ సందర్భంగా సూరి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com