'భారత్' సినిమా కాన్సెప్ట్ టీజర్ విడుదల
- August 15, 2018
'భారత్' కాన్సెప్ట్ టీజర్ విడుదల ముంబయి: బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'భారత్'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. దిశా పటానీ సల్మాన్ సోదరిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా..ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్ను సల్మాన్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు. 'ఈ భూమిపై కొన్ని బంధుత్వాలు ఉంటాయి. మరికొన్ని రక్తసంబంధాలు ఉంటాయి. కానీ నాకు ఆ రెండూ ఉండేవి' అంటూ సల్మాన్ చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో సల్మాన్ ఇంతకు ముందెన్నడూ చూడని ఓ కొత్త అవతారంలో దర్శనమిస్తారని తెలుస్తోంది. భారతదేశ సంస్కృతి, మూలాలను కళ్లకుకట్టేలా 'భారత్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో దర్శకుడు జాఫర్ వెల్లడించారు. ఏడు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కథ సాగుతుంది. అందులో భాగంగా పలు దేశాల్లో చిత్రీకరణ జరపుతున్నారు. ఓ మనిషి, ఓ జాతి కలిసి చేసే ప్రయాణమే 'భారత్'.
వచ్చే ఏడాదిలో సల్మాన్కు బాగా కలిసొచ్చిన రంజాన్ రోజున ఈ చిత్రం విడుదలకానుంది
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







