'భారత్' సినిమా కాన్సెప్ట్ టీజర్ విడుదల
- August 15, 2018
'భారత్' కాన్సెప్ట్ టీజర్ విడుదల ముంబయి: బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'భారత్'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. దిశా పటానీ సల్మాన్ సోదరిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా..ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్ను సల్మాన్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు. 'ఈ భూమిపై కొన్ని బంధుత్వాలు ఉంటాయి. మరికొన్ని రక్తసంబంధాలు ఉంటాయి. కానీ నాకు ఆ రెండూ ఉండేవి' అంటూ సల్మాన్ చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో సల్మాన్ ఇంతకు ముందెన్నడూ చూడని ఓ కొత్త అవతారంలో దర్శనమిస్తారని తెలుస్తోంది. భారతదేశ సంస్కృతి, మూలాలను కళ్లకుకట్టేలా 'భారత్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో దర్శకుడు జాఫర్ వెల్లడించారు. ఏడు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కథ సాగుతుంది. అందులో భాగంగా పలు దేశాల్లో చిత్రీకరణ జరపుతున్నారు. ఓ మనిషి, ఓ జాతి కలిసి చేసే ప్రయాణమే 'భారత్'.
వచ్చే ఏడాదిలో సల్మాన్కు బాగా కలిసొచ్చిన రంజాన్ రోజున ఈ చిత్రం విడుదలకానుంది
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









