ఏయం జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా
- December 17, 2015
జిల్'తో హిట్ పెయిర్ అనిపించుకున్న గోపీచంద్, రాశీ ఖన్నా మళ్లీ జతకట్టిన చిత్రం 'ఆక్సిజన్'. ఏయమ్ రత్నం పెద్ద కుమారుడు ఏయం జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం చెన్నైలో జరిగాయి. ఇందులో జగపతిబాబు కీలక పాత్ర చేయనున్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ అనీ, జగపతిబాబుది పాజిటివ్ రోల్ అనీ చిత్రబృందం తెలిపింది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారు. 'కిక్' శ్యామ్, అనూ ఇమ్మాన్యుయెల్, అలీ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్రాజా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: వెట్రి, సూపర్విజన్: ఏఎమ్ రత్నం.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







