సౌదీ లో ముగిసిన క్షమాభిక్ష గడువు
- December 18, 2015
సౌదీ అరేబియాలో అక్రమంగా ఉంటున్న కార్మికులను అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది కార్మికులను అరెస్టు చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన సుమారు 350 మంది కార్మికులు పట్టుబడ్డట్లు కొందరు కార్మికులు 'సాక్షి'కి ఫోన్లో చెప్పారు. సౌదీకి వర్క్ వీసాపై వెళ్లిన కార్మికులు కొన్ని కారణాల వల్ల కంపెనీ నుంచి బయటకు వచ్చి కల్లివిల్లిగా పని చేస్తున్నారు. మరి కొందరు విజిట్ వీసాపై వెళ్లి వీసా గడువు ముగిసిపోయినా అక్కడే ఉండి బయట ఏదో ఒక పని చేస్తున్నారు. సౌదీలో పనిచేసే వారిలో తెలంగాణ జిల్లాలకు చెందినవారు లక్ష మంది ఉన్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







