రంగనాథ్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులర్పించారు
- December 20, 2015
సీనియర్ నటుడు రంగనాథ్ బలవన్మరణానికి పాల్పడ్డారన్న విషయం తనను షాక్కు గురిచేసిందని చిరంజీవి అన్నారు. ఫిలిం ఛాంబర్లో ఆయన భౌతికకాయానికి చిరంజీవి నివాళులర్పించారు. అనంతరం రంగనాధ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్ తొలి దశ నుంచి రంగనాథ్తో మంచి సంబంధాలున్నాయన్నారు. లవ్ ఇన్ సింగపూర్ చిత్రంలో రంగనాథ్ కథానాయకుడిగాను, తాను రెండో హీరోగా నటించిన విషయాలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఆయనతో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించినట్లు చెప్పారు. రంగనాథ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







