ఇండియా:పెట్రోల్ రేట్లు భారీగా తగ్గే అవకాశం
- November 02, 2018
భారత్లో పెట్రోల్ రేట్లు బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా ఆంక్షల పునరుద్దరణతో భారత దేశానికి ఊరట లభించి అవకాశం ఉంది. ఇరాన్ నుంచి ముడి చమురు కొనేందుకు ఇండియా, సౌత్ కొరియా, జపాన్ సహా 8 దేశాలకు అమెరికా అనుమతిచ్చింది.
వచ్చే వారం నుంచి ఇరాన్పై అమెరికా మరోసారి ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి పూర్తిగా ఆయిల్ దిగుమతులను నిలిపేయాలని అన్ని మిత్ర దేశాలను గతంలో అమెరికా ఆదేశించింది. అయితే తమకు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ 8 దేశాలు కోరాయి. ఇండియా తోపాటు జపాన్, సౌత్ కొరియా తమ చమురు దిగుమతుల కోసం ఎక్కువగా ఇరాన్పైనే ఆధారపడుతున్నాయి. తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయం ఈ దేశాలకు పెద్ద ఊరట కలిగించేదే.
ఇప్పటికీ అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, రెండో రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుందని చైనాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇండియా, సౌత్ కొరియాలాగే చైనా కూడా ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఊరట తాత్కాలికంగా మాత్రమే ఉండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
అమెరికా విధించిన ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ ముడి చమురు ఎగుమతులు భారీగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మధ్యలో రోజుకు 25 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తున్న ఇరాన్.. ఏడాది చివరినాటికి 15 లక్షల బ్యారెళ్లను మాత్రమే చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







