మహేష్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..!
- November 20, 2018బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్బాబుతో కలిసి సినిమా చేస్తారని చాలా మంది భావించారు. ‘తప్పకుండా సినిమా చేస్తాం’ అని పలు సందర్భాల్లో మహేశ్, రాజమౌళి చెప్పటంతో వీరిద్దరి కాంబినేషన్లోనే నెక్ట్స్ మూవీ ఉంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇద్దరూ స్పష్టం చెయలేదు. ఈ నేపథ్యంలో చరణ్, తారక్ తో రాజమౌళి మూవీ ప్రారంభించటంతో మహేష్ అభిమానులు కొంత నిరుత్సాహ పడ్డారు. అయితే మహేష్, రాజమౌళి సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత.. రాజమౌళి చేయబోయేది మహేశ్ చిత్రమే అని చిత్రపరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. అయితే 2020 వరకూ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బిజీగా ఉండనున్నారు. ఈలోపు మహేశ్.. సుకుమార్, సందీప్ రెడ్డితో సినిమాలు పూర్తి చేసుకుంటారని టాలీవుడ్ టాక్.
ఇదిలా ఉంటే రాజమౌళి, మహేశ్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఓ సరికొత్త పాయింట్తో ఉండబోతోందని ప్రచారం ఇప్పటి నుంచే జరుగుతోంది. మరో విశేషమేంటంటే ఈ మూవీ ద్వారానే మహేశ్ బాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనున్నారట. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తారట. మరి అధికారికంగా ప్రకటించే వరకు ఈ కాంబినేషన్పై ఇంకా ఎన్ని వార్తలు వస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ