మహేష్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..!
- November 20, 2018
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్బాబుతో కలిసి సినిమా చేస్తారని చాలా మంది భావించారు. ‘తప్పకుండా సినిమా చేస్తాం’ అని పలు సందర్భాల్లో మహేశ్, రాజమౌళి చెప్పటంతో వీరిద్దరి కాంబినేషన్లోనే నెక్ట్స్ మూవీ ఉంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇద్దరూ స్పష్టం చెయలేదు. ఈ నేపథ్యంలో చరణ్, తారక్ తో రాజమౌళి మూవీ ప్రారంభించటంతో మహేష్ అభిమానులు కొంత నిరుత్సాహ పడ్డారు. అయితే మహేష్, రాజమౌళి సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత.. రాజమౌళి చేయబోయేది మహేశ్ చిత్రమే అని చిత్రపరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. అయితే 2020 వరకూ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బిజీగా ఉండనున్నారు. ఈలోపు మహేశ్.. సుకుమార్, సందీప్ రెడ్డితో సినిమాలు పూర్తి చేసుకుంటారని టాలీవుడ్ టాక్.
ఇదిలా ఉంటే రాజమౌళి, మహేశ్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఓ సరికొత్త పాయింట్తో ఉండబోతోందని ప్రచారం ఇప్పటి నుంచే జరుగుతోంది. మరో విశేషమేంటంటే ఈ మూవీ ద్వారానే మహేశ్ బాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనున్నారట. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తారట. మరి అధికారికంగా ప్రకటించే వరకు ఈ కాంబినేషన్పై ఇంకా ఎన్ని వార్తలు వస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







