మహేష్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..!
- November 20, 2018
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్బాబుతో కలిసి సినిమా చేస్తారని చాలా మంది భావించారు. ‘తప్పకుండా సినిమా చేస్తాం’ అని పలు సందర్భాల్లో మహేశ్, రాజమౌళి చెప్పటంతో వీరిద్దరి కాంబినేషన్లోనే నెక్ట్స్ మూవీ ఉంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇద్దరూ స్పష్టం చెయలేదు. ఈ నేపథ్యంలో చరణ్, తారక్ తో రాజమౌళి మూవీ ప్రారంభించటంతో మహేష్ అభిమానులు కొంత నిరుత్సాహ పడ్డారు. అయితే మహేష్, రాజమౌళి సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత.. రాజమౌళి చేయబోయేది మహేశ్ చిత్రమే అని చిత్రపరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. అయితే 2020 వరకూ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బిజీగా ఉండనున్నారు. ఈలోపు మహేశ్.. సుకుమార్, సందీప్ రెడ్డితో సినిమాలు పూర్తి చేసుకుంటారని టాలీవుడ్ టాక్.
ఇదిలా ఉంటే రాజమౌళి, మహేశ్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఓ సరికొత్త పాయింట్తో ఉండబోతోందని ప్రచారం ఇప్పటి నుంచే జరుగుతోంది. మరో విశేషమేంటంటే ఈ మూవీ ద్వారానే మహేశ్ బాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనున్నారట. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తారట. మరి అధికారికంగా ప్రకటించే వరకు ఈ కాంబినేషన్పై ఇంకా ఎన్ని వార్తలు వస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి