స్మగ్లింగ్ డ్రగ్ పిల్స్: ముగ్గురికి జైలు
- November 29, 2018యూ.ఏ.ఈ:12 మిలియన్ కాప్టగాన్ పిల్స్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ముగ్గురికీ జీవిత ఖైదుని ఖరారు చేసింది అబుదాబీ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్. వీరి వద్ద నుంచి 480 మిలియన్ దిర్హామ్ల విలువైన కాప్టగాన్ పిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ షిప్ ద్వారా ఈ పిల్స్ని యూఏఈలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. మొదటి నిందితుడ్ని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశాక, నలభై ఐదు రోజుల అనంతరం మిగతా నిందితుల్ని అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో తొలుత నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. విచారణ సందర్భంగా అధికారులు పూర్తిస్థాయిలో ఆధారాలు చూపించడంతో న్యాయస్థానం నిందితుల్ని దోషులుగా నిర్ధారించి, శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్