స్మగ్లింగ్‌ డ్రగ్‌ పిల్స్‌: ముగ్గురికి జైలు

- November 29, 2018 , by Maagulf
స్మగ్లింగ్‌ డ్రగ్‌ పిల్స్‌: ముగ్గురికి జైలు

యూ.ఏ.ఈ:12 మిలియన్‌ కాప్టగాన్‌ పిల్స్‌ని స్మగ్లింగ్‌ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ముగ్గురికీ జీవిత ఖైదుని ఖరారు చేసింది అబుదాబీ ఫెడరల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌. వీరి వద్ద నుంచి 480 మిలియన్‌ దిర్హామ్‌ల విలువైన కాప్టగాన్‌ పిల్స్‌ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ షిప్‌ ద్వారా ఈ పిల్స్‌ని యూఏఈలోకి స్మగుల్‌ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. మొదటి నిందితుడ్ని పక్కా సమాచారంతో అరెస్ట్‌ చేశాక, నలభై ఐదు రోజుల అనంతరం మిగతా నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానంలో తొలుత నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. విచారణ సందర్భంగా అధికారులు పూర్తిస్థాయిలో ఆధారాలు చూపించడంతో న్యాయస్థానం నిందితుల్ని దోషులుగా నిర్ధారించి, శిక్ష ఖరారు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com