స్మగ్లింగ్ డ్రగ్ పిల్స్: ముగ్గురికి జైలు
- November 29, 2018
యూ.ఏ.ఈ:12 మిలియన్ కాప్టగాన్ పిల్స్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ముగ్గురికీ జీవిత ఖైదుని ఖరారు చేసింది అబుదాబీ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్. వీరి వద్ద నుంచి 480 మిలియన్ దిర్హామ్ల విలువైన కాప్టగాన్ పిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ షిప్ ద్వారా ఈ పిల్స్ని యూఏఈలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. మొదటి నిందితుడ్ని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశాక, నలభై ఐదు రోజుల అనంతరం మిగతా నిందితుల్ని అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో తొలుత నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. విచారణ సందర్భంగా అధికారులు పూర్తిస్థాయిలో ఆధారాలు చూపించడంతో న్యాయస్థానం నిందితుల్ని దోషులుగా నిర్ధారించి, శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









