స్మగ్లింగ్ డ్రగ్ పిల్స్: ముగ్గురికి జైలు
- November 29, 2018
యూ.ఏ.ఈ:12 మిలియన్ కాప్టగాన్ పిల్స్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ముగ్గురికీ జీవిత ఖైదుని ఖరారు చేసింది అబుదాబీ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్. వీరి వద్ద నుంచి 480 మిలియన్ దిర్హామ్ల విలువైన కాప్టగాన్ పిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ షిప్ ద్వారా ఈ పిల్స్ని యూఏఈలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. మొదటి నిందితుడ్ని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశాక, నలభై ఐదు రోజుల అనంతరం మిగతా నిందితుల్ని అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో తొలుత నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. విచారణ సందర్భంగా అధికారులు పూర్తిస్థాయిలో ఆధారాలు చూపించడంతో న్యాయస్థానం నిందితుల్ని దోషులుగా నిర్ధారించి, శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







