షార్జా:ఫ్లూ వలన భారతీయ బాలిక మృతి
- November 29, 2018
షార్జా:షార్జాలోని గల్ఫ్ ఏసియన్ స్కూల్లో ఆరేళ్ళ ఇండియన్ బాలిక ఫ్లూ కారణంగా మృతి చెందినట్లు స్కూల్ సర్క్యులర్లో పేర్కొన్నారు. గ్రేడ్ 2 చదువుతున్న షిబా ఫాతిమా, ఫ్లూ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సర్కులర్లో పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ఈ విషయమై స్కూల్ యాజమాన్యం విజ్ఞప్తి కూడా చేసింది. చిన్నారిని ఇంట్లోనే వుంచాలనీ, స్కూల్కి పంపించరాదని ఆ విజ్ఞప్తి లేఖలో పేర్కొన్నారు. కాగా, ఫాతిమాను ఆసుపత్రికి తరలించగా, ఆమె అక్కడ మృతి చెందింది. ఫ్లూ కారణంగా మరణాలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్లూ సంబంధిత లక్షణాలు బయటపడిన వెంటనే తగిన వైద్య సహాయం అందించాల్సి వుంటుంది. నిర్లక్ష్యం, ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్లూ సంబంధిత మరణాలు ఎక్కువవుతుండడం పట్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









