షార్జా:ఫ్లూ వలన భారతీయ బాలిక మృతి
- November 29, 2018షార్జా:షార్జాలోని గల్ఫ్ ఏసియన్ స్కూల్లో ఆరేళ్ళ ఇండియన్ బాలిక ఫ్లూ కారణంగా మృతి చెందినట్లు స్కూల్ సర్క్యులర్లో పేర్కొన్నారు. గ్రేడ్ 2 చదువుతున్న షిబా ఫాతిమా, ఫ్లూ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సర్కులర్లో పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ఈ విషయమై స్కూల్ యాజమాన్యం విజ్ఞప్తి కూడా చేసింది. చిన్నారిని ఇంట్లోనే వుంచాలనీ, స్కూల్కి పంపించరాదని ఆ విజ్ఞప్తి లేఖలో పేర్కొన్నారు. కాగా, ఫాతిమాను ఆసుపత్రికి తరలించగా, ఆమె అక్కడ మృతి చెందింది. ఫ్లూ కారణంగా మరణాలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్లూ సంబంధిత లక్షణాలు బయటపడిన వెంటనే తగిన వైద్య సహాయం అందించాల్సి వుంటుంది. నిర్లక్ష్యం, ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్లూ సంబంధిత మరణాలు ఎక్కువవుతుండడం పట్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..