బిళ్ళల పులుసు
- May 10, 2015
ఈరోజు ఒక వైవిధ్యమైన వంటకం తో మీ ముందుకు వచ్చాం. తెలంగాణా వారి ప్రత్యేకం. అదే ‘బిళ్ళల పులుసు’. దీనినే ‘వెజ్ చేపల కూర’ అని కూడా అంటారు. మరి తయారీ ఎలాగో చూసేద్దామా..!
కావలసిన పదార్ధాలు:
- ఉల్లిపాయలు - 2 లేక 3 పెద్దవి
- జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూను
- ఉప్పు - తగినంత
- పచ్చికారం - సరిపడా
- శనగపిండి - 1 కప్పు
- మెంతి పొడి - 1/2 టేబుల్ స్పూను
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూను
- చింతపండు రసం - 3 టేబుల్ స్పూన్లు
- బెల్లం - కొద్దిగా
- కరివేపాకు - కొద్దిగా
- కొత్తిమీర - కొద్దిగా
- నీరు - 1 1/2 కప్పు
చేయు విధానం:
బిళ్ళలు:
- ఒక బాండీలో నూనె పోసి వేడి చేయాలి. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేపండి.
- ఇప్పుడు నీళ్ళు, ఉప్పు, పచ్చికారం వేసి కాగనివ్వండి.
- శనగపిండి ని చల్లటి నీళ్ళల్లో కలిపి ఆ మిశ్రమాన్ని ఈ మరుగుతున్న నీటిలో మెల్లిగా ఉండలు కట్టకుండా చూసుకుంటూ వేయాలి. మూకుడు అంచులకి శనగపిండి అంటనంతవరకు ఉడికించి స్టవ్ మీద నుండి దించేయాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ కి నూనె/నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేయండి. చల్లారాక, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోండి.
పులుసు:
- ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయండి. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెళ్లి ముద్ద, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేదాక వేయించండి.
- ఇప్పుడు చింతపండు రసం వేసి బాగా మరగనివ్వండి.
- ఉప్పు, మెంతి పొడి, పచ్చికారం, ధనియాల పొడి, బెల్లం వేసి ఒక 5-7 నిమిషాలు మరగనివ్వండి.
- ముందుగా చేసుకున్న బిళ్ళలు ఇందులో మెల్లిగా వేసి మరి కాసేపు అనగా 2-3 నిమిషాలు మరగనిచ్చి, స్టవ్ మీద నుండి దించి కోత్హిమీర చల్లి సర్వ్ చేసుకోవటమే.
ఇది అన్నంతో మరియు రోటి తో బాగుంటుంది.
------ పి.రమ్య, దుబాయ్, యు ఏ ఈ.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









