ఘోరం..గుడిలో ప్రసాదం తిని 5 మంది మృతి..
- December 14, 2018కర్నాటక:కర్నాటకలో ఘోరం చోటు చేసుకుంది. చామరాజనగర్ జిల్లాలోని కొల్లేగాళ గ్రామంలోని మారమ్మ గుడిలో ప్రసాదం తిని 5 మంది చనిపోయారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మైసూర్లోని ఆస్పత్రిలో మరో 50 మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇంత ఘోరం జరగడానికి ఫుడ్ పాయిజన్ అవడం కారణం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసాదంలో విష గుళికలు కలిశాయని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. అందుకే.. ఇంత పెద్ద ఘోరం జరిగిందని చెప్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించారు.
కర్నాటకలో 5 మంది భక్తుల ప్రాణాలు తీసిన పాపం ఎవ్వరిది? ఈ విషయంలో దృష్టి సారించిన పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. కొన్నాళ్లుగా స్థానికులకు, ఆలయ పూజారికి మధ్య వివాదం నడుస్తున్నట్టు బయటపడింది. ఈనేపథ్యంలో ప్రసాదంలో ఎవరో విషం కలిపి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు