ఘోరం..గుడిలో ప్రసాదం తిని 5 మంది మృతి..
- December 14, 2018
కర్నాటక:కర్నాటకలో ఘోరం చోటు చేసుకుంది. చామరాజనగర్ జిల్లాలోని కొల్లేగాళ గ్రామంలోని మారమ్మ గుడిలో ప్రసాదం తిని 5 మంది చనిపోయారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మైసూర్లోని ఆస్పత్రిలో మరో 50 మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇంత ఘోరం జరగడానికి ఫుడ్ పాయిజన్ అవడం కారణం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసాదంలో విష గుళికలు కలిశాయని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. అందుకే.. ఇంత పెద్ద ఘోరం జరిగిందని చెప్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించారు.
కర్నాటకలో 5 మంది భక్తుల ప్రాణాలు తీసిన పాపం ఎవ్వరిది? ఈ విషయంలో దృష్టి సారించిన పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. కొన్నాళ్లుగా స్థానికులకు, ఆలయ పూజారికి మధ్య వివాదం నడుస్తున్నట్టు బయటపడింది. ఈనేపథ్యంలో ప్రసాదంలో ఎవరో విషం కలిపి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









