ఘోరం..గుడిలో ప్రసాదం తిని 5 మంది మృతి..
- December 14, 2018
కర్నాటక:కర్నాటకలో ఘోరం చోటు చేసుకుంది. చామరాజనగర్ జిల్లాలోని కొల్లేగాళ గ్రామంలోని మారమ్మ గుడిలో ప్రసాదం తిని 5 మంది చనిపోయారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మైసూర్లోని ఆస్పత్రిలో మరో 50 మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇంత ఘోరం జరగడానికి ఫుడ్ పాయిజన్ అవడం కారణం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసాదంలో విష గుళికలు కలిశాయని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. అందుకే.. ఇంత పెద్ద ఘోరం జరిగిందని చెప్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించారు.
కర్నాటకలో 5 మంది భక్తుల ప్రాణాలు తీసిన పాపం ఎవ్వరిది? ఈ విషయంలో దృష్టి సారించిన పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. కొన్నాళ్లుగా స్థానికులకు, ఆలయ పూజారికి మధ్య వివాదం నడుస్తున్నట్టు బయటపడింది. ఈనేపథ్యంలో ప్రసాదంలో ఎవరో విషం కలిపి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







