హైదరాబాద్:మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్కు ఒకే కార్డు...
- December 18, 2018
హైదరాబాద్ జంట నగరాల వాసులకు ఇది ముమ్మాటికీ శుభవార్తే... త్వరలోనే మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించాలంటే ఒక కార్డు తీసుకుంటే సరిపోతుంది. 'మెట్రో కామన్ మోబిలిటీ కార్డ్' పేరుతో ఇది త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై వారం రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. టీఆర్ అండ్ బీ ప్రధాన కార్యదర్శి సుశీల్ శర్మ, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి... బేగంపేట్లోని హెచ్ఎంఆర్ఎల్ కార్యాలయంలో కామన్ మోబిలిటీ కార్డ్ అమలుపై సమీక్షించారు. ఎస్బీఐ/ హిటాచీ కన్సార్టియం ద్వారా సీఎంసీ అండ్ టీ మెట్రో సీఎంసీ కార్డును అమలు చేయడానికి హోదాను ఇచ్చారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి, 2019 జనవరి చివరికి కనీసం రెండు మెట్రో స్టేషన్లలో, 100 ఆర్టీసీ బస్సుల్లో, 50 ఆటోస్ మెట్రో క్యాంపెన్షన్ ప్రాంతాల ద్వారా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు పురోగతిని ప్రిన్సిపాల్ సెక్రటరీ టీఆర్ అండ్ బీ, ఎంఎండీ, హెచ్ఎమ్ఆర్ఎల్ పర్యవేక్షిస్తారు. ఇది సక్సెస్ అయితే... జంట నగరాల పరిధిలో త్వరలోనే 'మెట్రో కామన్ మోబిలిటీ కార్డ్' అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









