ఖసరిబేసిగ నియమం నుంచి మహిళలకు, వీఐపీలకు మినహాయింపు
- December 24, 2015
మహిళలకు, వీఐపీలకు ఖసరిబేసిగ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీలో కాలుష్యం అధికంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం కార్ల వాడకం తగించేందుకు ఖసరిబేసిగ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. 12ఏళ్లలోపు పిల్లలు ఉన్న మహిళలకు, ఒంటరి మహిళలకు, వీఐపీలకు జనవరి 15వ తేదీ వరకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ తనకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. నియమాన్ని అతిక్రమించిన వారికి రూ.2వేలు జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, చీఫ్ జస్టిస్, లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, కేంద్రమంత్రులు, ప్రతిపక్షపార్టీ నేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్ వీఐపీల జాబితాలో ఉంటారని, అత్యవసర వాహనాలకు కూడా ఈ నియమం వర్తించదని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ 6వేల బస్సులను అదనంగానడపనున్నట్లు దిల్లీ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









