ఖసరిబేసిగ నియమం నుంచి మహిళలకు, వీఐపీలకు మినహాయింపు
- December 24, 2015
మహిళలకు, వీఐపీలకు ఖసరిబేసిగ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీలో కాలుష్యం అధికంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం కార్ల వాడకం తగించేందుకు ఖసరిబేసిగ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. 12ఏళ్లలోపు పిల్లలు ఉన్న మహిళలకు, ఒంటరి మహిళలకు, వీఐపీలకు జనవరి 15వ తేదీ వరకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ తనకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. నియమాన్ని అతిక్రమించిన వారికి రూ.2వేలు జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, చీఫ్ జస్టిస్, లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, కేంద్రమంత్రులు, ప్రతిపక్షపార్టీ నేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్ వీఐపీల జాబితాలో ఉంటారని, అత్యవసర వాహనాలకు కూడా ఈ నియమం వర్తించదని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ 6వేల బస్సులను అదనంగానడపనున్నట్లు దిల్లీ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







