రిషబ్‌ చిట్‌ఫండ్‌ యజమాని అరెస్టు

- December 20, 2018 , by Maagulf
రిషబ్‌ చిట్‌ఫండ్‌ యజమాని అరెస్టు

హైదరాబాద్‌: చిట్టీల పేరుతో ఖాతాదారుల నుంచి సుమారు రూ. 200 కోట్లు వసూలు చేసి పరారైన రిషబ్‌ చిట్‌ఫండ్‌ యజమానిని సిసిఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ గుజ్జర్‌, అతని భార్య నందినిని బోయగూడలోని వారి నివాసంలో గురువారం అదపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్‌లోని రిషబ్‌ చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారిద్ధరి సమక్షంలోనే సుమారు మూడు గంటల పాలు కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి దర్యాప్తు నిమిత్తం వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి అరెస్టు సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున శైలేష్‌ నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com