రిషబ్ చిట్ఫండ్ యజమాని అరెస్టు
- December 20, 2018హైదరాబాద్: చిట్టీల పేరుతో ఖాతాదారుల నుంచి సుమారు రూ. 200 కోట్లు వసూలు చేసి పరారైన రిషబ్ చిట్ఫండ్ యజమానిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ గుజ్జర్, అతని భార్య నందినిని బోయగూడలోని వారి నివాసంలో గురువారం అదపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్లోని రిషబ్ చిట్ఫండ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారిద్ధరి సమక్షంలోనే సుమారు మూడు గంటల పాలు కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి దర్యాప్తు నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వారి అరెస్టు సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున శైలేష్ నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం