'మీ టూ' కు మోడీ భయపడ్డారా?
- December 20, 2018
ప్రధాని నరేంద్ర మోడీని బాలీవుడ్ ప్రముఖులు ముంబై రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ సాధించిన ప్రగతి, పలు అంశాల గురించి విస్తృతంగా చర్చించామని మోడీ తెలిపారు. బాలీవుడ్ నిర్మాతలు రితేష్ సిద్వానీ, కరణ్ జోహార్, సిద్దార్థ్ రాయ్ కపూర్, రాకేష్ రోషన్, రోనీ స్క్రూవాలా, ప్రసూన్ జోషి తదితరులు ప్రధానిని కలిసిన బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా.' చిత్ర పరిశ్రమ ప్రముఖులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. సినీ రంగంలో జీఎస్టీ అమలు విధివిధానాలపై వారి విలువైన సలహాలు ఇచ్చారు' అంటూ సినీ ప్రముఖులతో దిగిన ఫొటోను మోదీ ట్వీటర్లో పోస్ట్ చేశారు. ప్రధాని ట్వీట్పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ' సినీ రంగంలో కావాల్సినంత మంది మహిళలు ఉన్నారు. కానీ ప్రధానిని కలిసిన బృందంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం చాలా బాగుంది' అంటూ ఓ మహిళ వ్యంగ్యంగా ట్వీట్ చేయగా. 'భారత్లో మీటూ ఉద్యమం ప్రకంపనలు పుట్టించినప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సినీ రంగంలో ఉన్న మహిళలు ప్రధానిని కలవడానికి అర్హులు కారేమో' అంటూ మరొకరు మండిపడ్డారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







