ఆంధ్రప్రదేశ్లో మొత్తం రహదారుల నెట్వర్క్ను డిజిటలైజ్ చేయాలని..
- December 24, 2015ఆంధ్రప్రదేశ్లో మొత్తం రహదారుల నెట్వర్క్ను డిజిటలైజ్ చేయాలని రవాణా శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నూతన జాతీయరహదారులు, రహదారుల ప్రణాళికలపై గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన జనవరి 31లోపు రాష్ట్రంలోని అన్ని రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులపై రోజువారీ సమీక్ష చేసి ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలు సమర్పించాలని సూచించారు. రహదారులకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మేరకు ప్రాజెక్టులవారీగా కేంద్రానికి అందజేయాల్సిన నివేదికలు, డీపీఆర్లను సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దుర్గ గుడి ఫ్లయ్ ఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే కృష్ణా పుష్కరాల లోపు పూర్తవ్వాలని అధికారలను ఆదేశించారు. నూతన రాజధాని అమరావతి చుట్టూ 180 కిలోమీటర్ల మేర అవుటర్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి రూ. 20 వేల కోట్లు వ్యయం కాగలదని అంచనా వేసినట్లు చెప్పారు. గ్రామీణ రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం నాబార్డు నిధులను ఉపయోగించుకునేందుకు అవసరమయ్యే ప్రణాళికలు సిద్ధం చేయాలని, అలాగే ప్రపంచ బ్యాంక్, జైకా నుంచి కూడా రహదారులనిర్మాణానికి నిధులు సమీకరించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు. వచ్చే మూడేళ్లలో రహదారుల పనుల ప్రాధాన్య క్రమాన్ని సంవత్సరాల వారీగా నిర్దేశించుకుని ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని ముఖ్యమంత్రి కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







