మరో వీరప్పన్ తెలుగు థియేటర్లలో పోటీకి రెడీ ..
- December 26, 2015
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కిల్లింగ్ వీరప్పన్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఎలా చనిపోయాడు అన్న అంశాన్ని సినిమాగా తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమాలో.. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ కు గురైన కన్నడ నటుడు రాజ్ కుమార్ తనయుడు హీరోగా నటించటంతో కిల్లింగ్ వీరప్పన్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో జనవరి 1న రిలీజ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా, ఇప్పుడు మరో వీరప్పన్ తెలుగు థియేటర్లలో పోటీకి రెడీ అవుతున్నాడు. 2013లో యాక్షన్ స్టార్ అర్జున్, కిశోర్ ప్రధాన పాత్రల్లో వనయుద్ధం పేరుతో వీరప్పన్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు ఇదే సినిమాను వీరప్పన్ పేరుతో జనవరి 1న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ప్రచారం తమ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు వీరప్పన్ నిర్మాతలు. మరి ఈ ఇద్దరు వీరప్పన్ లలో తెలుగు ప్రేక్షకులను ఎవరు మెప్పిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







