కూలిన ఆనకట్ట..200 మంది గల్లంతు
- January 26, 2019
బ్రెజిల్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆనకట్ట కూలడంతో దాదాపు తోమ్మిది ప్రాణాలు కోల్పోగా 300 మంది గాయపడ్డారు. చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద ఘటన తెలుసుకున్న అధికారులు సంఘటన స్ధలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బెలో హారిజాంటే ప్రాంతంలో నిర్మించిన ఈ ఆనకట్టను బ్రెజిల్లోని మైనింగ్ దిగ్గజం వాలే కంపెనీ వ్యర్థపదార్థాలను వేసేందుకు ఉపయోగిస్తుంది. శిథిలావస్థకు చేరుకున్న ఆ డ్యామ్ ఒక్కసారిగా తెగి భవన సముదాయాన్ని ముంచెత్తింది.ఇక్కడ నివిస్తున్న వారంతా గని కార్మకులే. బురుద ఒక్కసారిగా ముంచేత్తడంతో చాలా మంది దానిలో ఇరుక్కుపోయారు. 200 మంది వరకు గల్లంతైనట్లుగా సమాచారం. అధికారులు ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







