పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దు:మోదీ
- January 29, 2019ఢిల్లీ: ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ప్రధాని మోడి ఈరోజు పరీక్ష పే చర్చా కార్యక్రమం ద్వారా రెండోసారి విద్యార్థులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో పరీక్షలు, తదితర అంశాలపై మాట్లాడారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దని, పరీక్షలే జీవితం కాదని మోడి విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలు నెరవేర్చాలని అనుకోవద్దని తెలిపారు.అనుకోవడంతో చిన్నారులపై భారం పెరుగుతుందని, అలా చేయకూడదని చెప్పారు. పిల్లలు విఫలమైనప్పుడు కూడా తల్లిదండ్రులు చిన్నారుల వెన్ను తట్టి ప్రోత్సహించాలని తెలిపారు. తల్లిదండ్రులు దగ్గరుండి సాంకేతికత సాయంతో కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా క్షమార్హం.. కానీ మీ లక్ష్యం చిన్నదైతే మాత్రం అది క్షమార్హం కాదని మోడి వెల్లడించారు. మీరు రోజుకు 17 గంటలు పనిచేయడానికి ఏం అంశం మిమ్మల్ని ప్రోత్సహిస్తోందని ఓ విద్యార్థిని మోదీని ప్రశ్నించగా.. ఓ తల్లి కుటుంబం కోసం 24 గంటలు శ్రమించినట్లుగానే, నేను నా 1.25కోట్ల భారతీయ కుటుంబం కోసం శ్రమిస్తున్నానని సమాధానమిచ్చారు. రోజులోని 24 గంటలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలని మోదీ విద్యార్థులకు సూచించారు.
సమయం సద్వినియోగం చేసుకోవడానికి ఎంబీఏలు అవసరం లేదని అన్నారు. గత ఏడాది కేవలం ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని విద్యార్థులే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు రష్యా, నేపాల్, నైజీరియా, ఇరాన్, దోహా, కువైట్, సౌదీ అరేబియా, సింగపూర్లలో చదువుతున్న పలువురు భారతీయ విద్యార్థులు కూడా వచ్చారు.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్